కోవిడ్ ఎఫెక్ట్ తో కాన్సులర్ సేవలను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ

- June 25, 2021 , by Maagulf
కోవిడ్ ఎఫెక్ట్ తో కాన్సులర్ సేవలను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ

కువైట్: కోవిడ్ 19 ప్రభావం కువైట్లోని భారత రాయబార కార్యాలయ కాన్సులర్ సేవలపై పడింది. కోవిడ్ కారణంగా జులై 1 వరకు కాన్సులర్ సేవలను నిలిపివేత్తున్నట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. అయితే..అత్యవసర సేవలు మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. అత్యవసర సేవలు పొందేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. [email protected] సేవల కోసం ద్వారా ఎంబసీ అధికారులను సంప్రదించి అపాయింట్మెంట్ పొందవచ్చు. రాబోయే రెండు వారాలకు సంబంధించి ఎంబసీ నిర్వహించే ఈవెంట్లు కూడా రీషెడ్యూల్ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే..కువైట్లోని తమ మూడు పాస్ పోర్టు కేంద్రాల ద్వారా పాస్ పోర్టు సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఇదిలాఉంటే..ఈ ఏడాదిలో కోవిడ్ కారణంగా ఎంబసీ కార్యాలయం కాన్సులర్ సేవలను నిలిపివేయటం ఇది రెండో సారి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com