కోవిడ్ ఎఫెక్ట్ తో కాన్సులర్ సేవలను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ
- June 25, 2021
కువైట్: కోవిడ్ 19 ప్రభావం కువైట్లోని భారత రాయబార కార్యాలయ కాన్సులర్ సేవలపై పడింది. కోవిడ్ కారణంగా జులై 1 వరకు కాన్సులర్ సేవలను నిలిపివేత్తున్నట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. అయితే..అత్యవసర సేవలు మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. అత్యవసర సేవలు పొందేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. [email protected] సేవల కోసం ద్వారా ఎంబసీ అధికారులను సంప్రదించి అపాయింట్మెంట్ పొందవచ్చు. రాబోయే రెండు వారాలకు సంబంధించి ఎంబసీ నిర్వహించే ఈవెంట్లు కూడా రీషెడ్యూల్ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే..కువైట్లోని తమ మూడు పాస్ పోర్టు కేంద్రాల ద్వారా పాస్ పోర్టు సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఇదిలాఉంటే..ఈ ఏడాదిలో కోవిడ్ కారణంగా ఎంబసీ కార్యాలయం కాన్సులర్ సేవలను నిలిపివేయటం ఇది రెండో సారి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







