కోవిడ్ ఎఫెక్ట్ తో కాన్సులర్ సేవలను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ
- June 25, 2021
కువైట్: కోవిడ్ 19 ప్రభావం కువైట్లోని భారత రాయబార కార్యాలయ కాన్సులర్ సేవలపై పడింది. కోవిడ్ కారణంగా జులై 1 వరకు కాన్సులర్ సేవలను నిలిపివేత్తున్నట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. అయితే..అత్యవసర సేవలు మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. అత్యవసర సేవలు పొందేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. [email protected] సేవల కోసం ద్వారా ఎంబసీ అధికారులను సంప్రదించి అపాయింట్మెంట్ పొందవచ్చు. రాబోయే రెండు వారాలకు సంబంధించి ఎంబసీ నిర్వహించే ఈవెంట్లు కూడా రీషెడ్యూల్ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే..కువైట్లోని తమ మూడు పాస్ పోర్టు కేంద్రాల ద్వారా పాస్ పోర్టు సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఇదిలాఉంటే..ఈ ఏడాదిలో కోవిడ్ కారణంగా ఎంబసీ కార్యాలయం కాన్సులర్ సేవలను నిలిపివేయటం ఇది రెండో సారి.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









