సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నారప్ప’ .!
- June 29, 2021
వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’ కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్ర నిర్మాత అయిన కలైపులి ధాను తెలుగు సినిమాకూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. తాజాగా ‘నారప్ప’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. తమిళ చిత్రం ‘అసురన్’ సైతం అప్పట్లో ఇదే సర్టిఫికెట్ పొందింది.
నారప్పగా వెంకటేశ్ నటిస్తే, విభిన్న పాత్రలు చేయడానికి మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి సుందరమ్మగా చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, నారప్ప టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే… రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే దాఖలాలు కనిపించడంలేదు. ఒక వేళ తెరుచుకున్నా, జనం ఎంతవరకూ థియేటర్ల వద్దకు వస్తారో సందేహమే. అందుకే ఈ చిత్ర నిర్మాతలు సురేశ్ బాబు, కలైపులి థాను ‘నారప్ప’ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా జూలై 24న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









