వాతావరణం సరిగా లేనందున అబూధాబీలో పాటశాలలకు సెలవు
- March 09, 2016వరుణునికి గల్ఫ్ దేశాల మీద కరుణ ఎక్కువై భారీ వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. దీంతో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో అబూ ధాబీ పాఠశాలలు బుధవారం (మార్చి 9 న) మూతబడ్డాయి. ఈ విషయాన్ని అబూ ధాబీ విద్యా మండలి ఒక ట్వీట్ లో మంగళవారం రాత్రి పొద్దుపోయాక చెప్పారు. ఈ కారణంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు సైతం కారుమబ్బులు అలుముకొని భారీ వర్షం కురిసె అవకాశాలు ఉన్నాయి , దేశ రాజధాని ప్రాంతంలో మంగళవారం ఉరుములతో కూడిన జల్లులు కురవడం జరిగింది, ఎండల తర్వాత అమాంతంగా వచ్చిన వర్షం వల్ల దాదాపు వారాంతం మొత్తం తడి వాతావరణంతో నెలకొని ఉంది. నైరుతి యుఎఇ నుండి వస్తున్న అల్పపీడన పొడిగింపు ఇందుకు ప్రధాన కారణం. రాజధాని లో చెల్లాచెదురుగా వర్షం కురవడమే కాక ఆకాశం మేఘావృతమై మంగళవారం ఉదయం నగరం పట్టపగలే చిమ్మచీకట్లు చుట్టుముట్టాయి. నగరం సన్నటి చినుకులతో మేల్కొంది, మధ్యాహ్నం వేళ అయితే , భారీ వర్షం నగరం కుండపోతగా కురిసింది. పలువురు నివాసితులు పరుగులు తీసుకొంటూ వర్షం నుంచి ఆశ్రయం కోరుకొంటూ వేగంగా నడుస్తున్నట్లు కనిపించింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ