వాతావరణం సరిగా లేనందున అబూధాబీలో పాటశాలలకు సెలవు
- March 09, 2016
వరుణునికి గల్ఫ్ దేశాల మీద కరుణ ఎక్కువై భారీ వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. దీంతో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో అబూ ధాబీ పాఠశాలలు బుధవారం (మార్చి 9 న) మూతబడ్డాయి. ఈ విషయాన్ని అబూ ధాబీ విద్యా మండలి ఒక ట్వీట్ లో మంగళవారం రాత్రి పొద్దుపోయాక చెప్పారు. ఈ కారణంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు సైతం కారుమబ్బులు అలుముకొని భారీ వర్షం కురిసె అవకాశాలు ఉన్నాయి , దేశ రాజధాని ప్రాంతంలో మంగళవారం ఉరుములతో కూడిన జల్లులు కురవడం జరిగింది, ఎండల తర్వాత అమాంతంగా వచ్చిన వర్షం వల్ల దాదాపు వారాంతం మొత్తం తడి వాతావరణంతో నెలకొని ఉంది. నైరుతి యుఎఇ నుండి వస్తున్న అల్పపీడన పొడిగింపు ఇందుకు ప్రధాన కారణం. రాజధాని లో చెల్లాచెదురుగా వర్షం కురవడమే కాక ఆకాశం మేఘావృతమై మంగళవారం ఉదయం నగరం పట్టపగలే చిమ్మచీకట్లు చుట్టుముట్టాయి. నగరం సన్నటి చినుకులతో మేల్కొంది, మధ్యాహ్నం వేళ అయితే , భారీ వర్షం నగరం కుండపోతగా కురిసింది. పలువురు నివాసితులు పరుగులు తీసుకొంటూ వర్షం నుంచి ఆశ్రయం కోరుకొంటూ వేగంగా నడుస్తున్నట్లు కనిపించింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







