వాతావరణం సరిగా లేనందున అబూధాబీలో పాటశాలలకు సెలవు
- March 09, 2016
వరుణునికి గల్ఫ్ దేశాల మీద కరుణ ఎక్కువై భారీ వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. దీంతో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో అబూ ధాబీ పాఠశాలలు బుధవారం (మార్చి 9 న) మూతబడ్డాయి. ఈ విషయాన్ని అబూ ధాబీ విద్యా మండలి ఒక ట్వీట్ లో మంగళవారం రాత్రి పొద్దుపోయాక చెప్పారు. ఈ కారణంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు సైతం కారుమబ్బులు అలుముకొని భారీ వర్షం కురిసె అవకాశాలు ఉన్నాయి , దేశ రాజధాని ప్రాంతంలో మంగళవారం ఉరుములతో కూడిన జల్లులు కురవడం జరిగింది, ఎండల తర్వాత అమాంతంగా వచ్చిన వర్షం వల్ల దాదాపు వారాంతం మొత్తం తడి వాతావరణంతో నెలకొని ఉంది. నైరుతి యుఎఇ నుండి వస్తున్న అల్పపీడన పొడిగింపు ఇందుకు ప్రధాన కారణం. రాజధాని లో చెల్లాచెదురుగా వర్షం కురవడమే కాక ఆకాశం మేఘావృతమై మంగళవారం ఉదయం నగరం పట్టపగలే చిమ్మచీకట్లు చుట్టుముట్టాయి. నగరం సన్నటి చినుకులతో మేల్కొంది, మధ్యాహ్నం వేళ అయితే , భారీ వర్షం నగరం కుండపోతగా కురిసింది. పలువురు నివాసితులు పరుగులు తీసుకొంటూ వర్షం నుంచి ఆశ్రయం కోరుకొంటూ వేగంగా నడుస్తున్నట్లు కనిపించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









