వాతావరణం సరిగా లేనందున అబూధాబీలో పాటశాలలకు సెలవు
- March 09, 2016వరుణునికి గల్ఫ్ దేశాల మీద కరుణ ఎక్కువై భారీ వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. దీంతో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో అబూ ధాబీ పాఠశాలలు బుధవారం (మార్చి 9 న) మూతబడ్డాయి. ఈ విషయాన్ని అబూ ధాబీ విద్యా మండలి ఒక ట్వీట్ లో మంగళవారం రాత్రి పొద్దుపోయాక చెప్పారు. ఈ కారణంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు సైతం కారుమబ్బులు అలుముకొని భారీ వర్షం కురిసె అవకాశాలు ఉన్నాయి , దేశ రాజధాని ప్రాంతంలో మంగళవారం ఉరుములతో కూడిన జల్లులు కురవడం జరిగింది, ఎండల తర్వాత అమాంతంగా వచ్చిన వర్షం వల్ల దాదాపు వారాంతం మొత్తం తడి వాతావరణంతో నెలకొని ఉంది. నైరుతి యుఎఇ నుండి వస్తున్న అల్పపీడన పొడిగింపు ఇందుకు ప్రధాన కారణం. రాజధాని లో చెల్లాచెదురుగా వర్షం కురవడమే కాక ఆకాశం మేఘావృతమై మంగళవారం ఉదయం నగరం పట్టపగలే చిమ్మచీకట్లు చుట్టుముట్టాయి. నగరం సన్నటి చినుకులతో మేల్కొంది, మధ్యాహ్నం వేళ అయితే , భారీ వర్షం నగరం కుండపోతగా కురిసింది. పలువురు నివాసితులు పరుగులు తీసుకొంటూ వర్షం నుంచి ఆశ్రయం కోరుకొంటూ వేగంగా నడుస్తున్నట్లు కనిపించింది.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల