భారత్ లో కరోనా కేసుల వివరాలు

- July 09, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో 43,393 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,07,52,950 కి చేరింది.ఇందులో 2,98,88,284 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,58,727 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 911 మంది మృతి చెందారు.దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,05,939 మంది క‌రోనాతో మృతి చెందారు.ఒక్క రోజులో దేశంలో 44,459 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 36,89,91,222 మందికి వ్యాక్సిన్ అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com