హజ్ పర్మిట్ లేకుండా మక్కాలోకి ఎంట్రీ..52 మంది అరెస్ట్
- July 09, 2021
సౌదీ: హజ్ పర్మిట్ లేకుండా పవిత్ర మక్కాలోకి ప్రవేశించిన 52 మందిని అరెస్ట్ చేసినట్లు హజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కమాండ్ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి మక్కాలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరికి SR10,000 జరిమానా విధించినట్లు వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే హజ్ యాత్రికులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. హజ్ పర్మిట్ ఉన్న భక్తులనే పవిత్ర ప్రార్ధనా ప్రాంగణంలోకి ఎంట్రీ ఉంటుంది. అనుమతి లేని వారిని అడ్డుకునేందుకు నిబంధనలు అతిక్రమిస్తే SR10,000 ఫైన్ విధించనున్నట్లు భద్రతా దళాలు ఇదివరకే ప్రకటించాయి. అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెడతూ హజ్ పర్మిట్ లేకుండానే పవిత్ర మసీదు, సెంట్రల్ హరామ్ ఏరియా, మినా, ముజ్దలిఫా, అరాఫత్ ప్రాంతాల్లోకి ఎంటరైన 52 మందిని అరెస్ట్ చేసి ఫైన్ విధించారు.ఇదే తప్పును పునరావృతం చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందని అధికారులు హెచ్చరించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







