సౌదీ రాజుకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ సుల్తాన్
- July 18, 2021
సౌదీ రాజు కింగ్ సల్మాన్ కు ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారీఖ్ ఈద్ అల్ అధా శుభాకాంక్షలు వ్యక్తం చేశారు. సౌదీ రాజుకు ఫోన్ చేసిన ఆయన..తన సౌదీ పర్యటలో లభించిన అతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలె సుల్తాన్ హైతం బిన్ తారీఖ్ సౌదీలో రెండు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. ఒమన్ సుల్తాన్ గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలం తర్వాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే కావటం విశేషం. ఈ పర్యటనలోనే రెండు దేశాల మధ్య సౌదీ-ఓమన్ మండలి ఏర్పాటకు MOU కుదిరింది. తన పర్యటన సానుకూల వాతవరణంలో ఫలవంతంగా ముగియటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే సౌదీ రాజు, ప్రభుత్వ ప్రతినిధుల నుంచి తనకు అందిన అతిథ్యం పట్ల కింగ్ సల్మాన్ కు ఫోన్లో ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







