నేరాలు తగ్గుముఖం పట్టడంలో సీసీ కెమెరాలు
- March 10, 2016
నేరాలు తగ్గుముఖం పట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్లో లక్ష కెమెరాలు ఏర్పాటే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. ఇప్పటికే నగరంలో 15వేల సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయినట్లు చెప్పారు.గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలతో పోల్చితే ఈ ఏడాది రెండు నెలల్లో 30 శాతం మేర నేరాలు తగ్గాయన్న ఆయన సీసీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటుచేయడమే దానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. మెహిదీపట్నం నుంచి మల్లేపల్లి కూడలి వరకు ఏర్పాటుచేసిన 38 సీసీ కెమెరాలను, కమాండ్ కంట్రోల్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









