పర్మిట్ లేకుండా బాణాసంచా కాలిస్తే జైలు, Dh100,000 ఫైన్
- July 22, 2021యూఏఈ: ఈద్ అల్ అధా పండగ సాకుతో అనుమతి లేకుండా బాణాసంచా కాలిస్తే జైలు శిక్ష తప్పదని అబుధాబి పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా హద్దుమీరి పటాసులు కాల్చితే ఏడాది తగ్గకుండా జైలు శిక్ష, Dh100,000 తగ్గకుండా జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక లైసెన్స్ లేకుండా బాణాసంచా అమ్మకాలు నిర్వహించినా, దిగుమతి, ఎగుమతి చేసినా, తయారు చేసినా, బాణాసంచా రవాణా చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తామని, అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానా రెండు విధిస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు బాణాసంచా కొనుగోలు చేయకుండా, ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా నచ్చచెప్పాలని, పటాసులకు బదులు ఇతర ప్రత్యామ్నాయ ఆటల వైపు ప్రొత్సాహించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాలిస్తే వెంటనే 999, 8002626కి ఫోన్ చేసిగానీ, అమన్ సర్వీస్ ద్వారాగానీ తమకు సమాచారం అందించాలని, వివరాలు అందించిన వారి వివరాలను కాన్ఫిడెన్షయల్ గా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?