తష్రీక్ మొదటి రోజు గులకరాళ్లు విసిరిన భక్తులు

- July 22, 2021 , by Maagulf
తష్రీక్ మొదటి రోజు గులకరాళ్లు విసిరిన భక్తులు

సౌదీ: మూడు రోజుల తష్రీక్ లో భాగంగా తొలి రోజున పవిత్ర స్థలం మినా జమారత్ (చెడుకు సంకేతంగా నిలిచే పిల్లర్ పై గులకరాళ్ళు విసరడం) కు భక్తులు తరలొచ్చారు.తష్రీక్ మొదటి రోజున చిన్న పిల్లర్ మీద భక్తులు గులకరాళ్లు విసిరారు. మక్కాకు తూర్పున ఉన్న మీనాలో ఈ మూడు పిల్లర్లు ఉంటాయి. మూడు రోజుల తష్రీక్ లో భాగంగా రెండో రోజున చిన్న పిల్లర్ పై జమారత్ నిర్విహిస్తారు. రెండో రోజున మధ్యస్తంగా ఉన్న పిల్లర్, మూడో రోజున పెద్ద పిల్లర్ పై రాళ్లు విసురుతారు. అల్లా చూపిన బాటకు విరుద్ధంగా దేవుడిపై నమ్మకం లేని చెడు శక్తులను నశించేలా రాళ్లు విసిరటమే జమారత్ ముఖ్య ఉద్దేశం. ప్రతి ఏడాది హజ్ లో జమారత్ ఓ భాగం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com