ఒలింపిక్స్ లో పి.వి సింధు శుభారంభం

- July 25, 2021 , by Maagulf
ఒలింపిక్స్ లో పి.వి సింధు శుభారంభం

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో స్టార్ షట్లర్ సింధు శుభారంభం చేసింది. గ్రూప్‌-జె తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై విజయం సాధించింది. 21-7, 21-10 తేడాతో సింధు గెలుపొందింది. అయితే గత ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సింధు ఈ ఏడాది అలాగైనా గోల్డ్ సాధించాలనే పట్టుదలతో ఉంది.

ఇక మరోవైపు హైదరాబాదీ టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా డబుల్స్‌ తొలి మ్యాచ్‌ ఈరోజు ఆడగా అందులో ఓటమిపాలైంది. సానియా మీర్జా, అంకిత రైనా ద్వయం.. ఉక్రెనియన్‌ జంటతో తలపడి ఓడిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com