రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- May 05, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం హీటెక్కింది. ప్రచారం కీలక దశకు చేరుకుంది. మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రేపటి నుంచి రెండు రోజులు ప్రధాని మోదీ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. రాజమండ్రి లోక్ సబ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. రాజమండ్రిలో రేపు ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభకు కూటమినేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వేమగిరి జాతీయ రహదారి పక్కన రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు బహిరంగ సభ జరగనుంది. గత ఏడాది ఇదే ప్రదేశంలో టిడిపి మహానాడు జరిగింది. విజయ శంఖారావం బహిరంగ సభకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలిరానున్న సుమారు రెండు లక్షల మందికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధాని భద్రతా సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణం పక్కనే ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు మూడు హెలిపాడ్లను సిద్ధం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







