ఒమన్: 20 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- July 27, 2021
మస్కట్: దేశ ప్రజల్లో దాదాపు 20 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు ఒమన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ గణాంకాల మేరకు గత ఆదివారం (జులై 25) నాటికి దేశవ్యాప్తంగా 19,26,307 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే మొత్తం లక్ష్యంగా ఎంచుకున్న గ్రూపులో 55 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తైనట్లు. అయితే..వ్యాక్సిన్ పొందిన వారిలో 15,87,784 (45శాతం) మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. 3,38,523(10 శాతం) మంది రెండు డోసులు తీసుకున్నారు. వ్యాక్సినేషన్ లో అన్ని గవర్నరేట్లలో మస్కట్ గవర్నరేట్ రికార్డ్ స్థాయిలో వ్యాక్సిన్ అందించింది. గవర్నరేట్ పరిధిలో ఇప్పటివరకు 6,18,264 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం









