కోవిడ్ టెస్ట్ ఫేక్ రిపోర్ట్ కేసులో దోషికి ఏడాది జైలు శిక్ష
- July 29, 2021
బహ్రెయిన్: కోవిడ్ టెస్ట్ నకిలీ రిపోర్ట్ అధికారులను బురిడి కొట్టించాలనుకున్న ఓ వ్యాపారి ప్లాన్ బెడిసికొట్టింది. ఫోర్జరీ రిపోర్ట్ గుట్టు బయటపడటమే కాకుండా అతని అతి తెలివికి ఏడాది జైలు శిక్ష పడింది.ఓ స్వీట్ వ్యాపారి గత మార్చిలో కింగ్ ఫహేద్ క్యాజ్ వే ద్వారా బహ్రెయిన్ నుంచి సౌదీ చేరుకునేందుకు బయల్దేరాడు. అయితే..కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు 72 గంటల్లోగా తీసుకున్న కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. కానీ, వ్యాపారి తన టెస్ట్ రిపోర్ట్ సమర్పించకుండా తన స్నేహితుడి రిపోర్ట్ ను ఫోర్జరీ చేసి తన పేరు మీదకు మార్చుకున్నాడు. అదే రిపోర్టును అధికారులకు సమర్పించాడు. అయితే..క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటంతో ఒరిజినల్ రిపోర్ట్ బయటపడింది. దీంతో బహ్రెయిన్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి దిగువ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు వ్యాపారికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. అయితే..ఆ శిక్షను బహ్రెయిన్ అప్పీల్స్ కోర్టు ఏడాదికి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









