కోవిడ్ తో చనిపోతే..రూ.లక్ష పరిహారం

- July 29, 2021 , by Maagulf
కోవిడ్ తో చనిపోతే..రూ.లక్ష పరిహారం

కువైట్: కువైట్ లోని ఇండియన్ ఎంబసీ కరోనా సంక్షోభ సమయంలో ప్రవాసులను ఆదుకునే దిశగా కీలక ప్రకటన చేసింది.కువైట్లో కోవిడ్ తో చనిపోయిన భారత ప్రవాసులకు పరిహారం రూపంలో రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించింది.కేవలం అల్పాదాయ వర్గానికి చెందిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఎంబసీ ఆధ్వర్యంలోని ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూపు(ICSG) సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.ఈ మేరకు బుధవారం(జులై 28, బుధవారం) జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జి ప్రకటించారు.120KD కంటే తక్కువ సాలరీ గల ఏ భారత ప్రవాసుడైన మహమ్మారితో చనిపోతే వారు ఈ పరిహారం పొందెందుకు అర్హులని రాయబారి వెల్లడించారు.

కాగా,ఇప్పటివరకు కువైట్లో 540 మంది భారతీయులు కరోనాతో చనిపోయారు.వీరిలో వంద మంది కంటే ఎక్కువ 120 కేడీల కంటే తక్కువ జీతం గలవారేనని సమాచారం.రాయబారి సిబి జార్జి మాట్లాడుతూ..లక్ష రూపాయలు అనేది పెద్ద మొత్తం కాదని తెలుసు,కానీ మృతుల కుటుంబానికి ఇది ఏదో ఒక రకంగా సహాయపడుతుందని అన్నారు.అర్హులైన వారిని ఎంబసీ అధికారులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు ఈ నగదు అందజేయస్తారని అంబాసిడర్ తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com