కేరళలో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్
- July 29, 2021
తిరువనంతపురం: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. జులై 31, ఆగస్టు 1 తేదీల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు వివరించింది.కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్డౌన్ పొడిగింపు లేదా పాక్షికంగా ఆంక్షల విధింపు పై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు. గత కొన్ని రోజులుగా కేరళలో ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేరళ సర్కారు లాక్డౌన్ విధించాలని ఈ రోజు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు,కేరళలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైద్య బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకుంది.జాతీయ అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల వైద్య బృందం ఆ రాష్ట్రానికి త్వరలోనే చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనాపై పోరులో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహాయపడనుంది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









