కేరళలో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్
- July 29, 2021
తిరువనంతపురం: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. జులై 31, ఆగస్టు 1 తేదీల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు వివరించింది.కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్డౌన్ పొడిగింపు లేదా పాక్షికంగా ఆంక్షల విధింపు పై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు. గత కొన్ని రోజులుగా కేరళలో ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేరళ సర్కారు లాక్డౌన్ విధించాలని ఈ రోజు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు,కేరళలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైద్య బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకుంది.జాతీయ అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల వైద్య బృందం ఆ రాష్ట్రానికి త్వరలోనే చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనాపై పోరులో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహాయపడనుంది.
తాజా వార్తలు
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!









