మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహణకు పోలీసు అనుమతులతో పాటు మరో తొమ్మిది విభాగాల అనుమతి ..
- March 11, 2016
: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహణకు పోలీసు అనుమతులతో పాటు మరో తొమ్మిది విభాగాల అనుమతి తప్పనిసరంటూ సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ముఖ్యంగా ఈ మొబైల్ ఫుడ్ కోర్టుల వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా వ్యాపారాన్ని నిర్వహించే వారు తప్పనిసరిగా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ నుంచి అనుమతిని తీసుకోవాలని సీపీ జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. లైట్ మోటర్, మీడియం మోటర్ , హెవీ మోటర్ వెహికిల్పై ఫుడ్ కోర్టును నిర్వహించే వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని సీపీ వెల్లడించారు.మార్చి 4 నుంచి అమల్లోకి వచ్చిందని, ఉల్లంఘిస్తే చర్యలుంటాయని చెప్పారు. కొత్త నిబంధనల వివరాలివి.. స్థానిక ఆర్టీఏ నుంచి ఫుడ్కోర్టు యజమానులు తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. తాజాగా రోడ్డు టాక్స్ను కట్టిన రశీదును జత చేయాలి. జీహెచ్ఎంసీ, స్థానిక ప్రభుత్వ విభాగాల అనుమతి తీసుకోవాలి. నిబంధనల ప్రకారం ఆహార నాణ్యతను పాటించాలి. ట్రేడ్ లైసెన్స్లను తీసుకోవాలి. జీహెచ్ఎంసీ అనుబంధ సంస్థ విభాగం ఆరోగ్య డిపార్ట్మెంట్ నుంచి ఎన్వోసీ పొందాలి. వ్యాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ, తప్పని సరిగా కమర్షియల్ సిలిండర్ల వాడకం. గ్యాస్, ఎలక్ట్రీక్ సేఫ్టీ సర్టిఫికెట్.వ్యాపారాన్ని నిర్వహించే ప్రాంతానికి సంబంధించిన లోకేషన్ను మ్యాప్ను పొందుపర్చడం ఫుడ్ కోర్టు వాహనాలు ప్రధాన రోడ్డుకు 60, 100 అడుగులో దూరంలోనే పెట్టుకోవడం వంటి నిబంధనలు పెట్టారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







