ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధాని మోడీ ప్రసంగం
- July 31, 2021
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో వర్చువల్ సమావేశంలో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మాట్లాడారు.భారత దేశంలో పోలీసు వ్యవస్థపై వ్యతిరేక అభిప్రాయం ఉందని, ఈ వ్యవస్థ ప్రతిష్ఠను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు.కోవిడ్-19 మహమ్మారి ప్రారంభంలో ఈ వ్యతిరేక ప్రజాభిప్రాయం తాత్కాలికంగా మారిందని చెప్పారు. అయితే మళ్ళీ పాత పరిస్థితులే పునరావృతమవుతున్నాయన్నారు.
భారత దేశం ప్రస్తుతం చరిత్రలో చాలా ముఖ్యమైన దశలో ఉందని చెప్పారు. ఇటువంటి సమయంలో పోలీసులు తమ వ్యవస్థ పేరు, ప్రతిష్ఠలు మెరుగుపడటానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ విపత్తు స్పందన దళం (NDRF)ను ఉదాహరణగా చూపించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందజేసే సేవలపై ప్రజలకు గొప్ప నమ్మకం ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా ఐపీఎస్ ట్రైనీలు పోలీస్ అకాడమీలో తమ అనుభవాలను మోడి కి వివరించారు. ప్రొబేషనర్లతో మోడి మాట్లాడుతూ వారి అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ అధికార పరిధిలోని భద్రతా పరిస్థితులతో ఏ విధంగా వ్యవహరించాలనుకుంటున్నదీ అడిగారు. వ్యక్తిత్వ లక్షణాలు, నేపథ్యాల నుంచి వచ్చిన అనుభవం వంటివాటిని ఉపయోగించి ఏ విధంగా పని చేస్తారో అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







