RRR నుంచి 'దోస్తీ' పాట వచ్చేసింది..!
- August 01, 2021
హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్చరణ్లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాని దోస్తీ' అనే సాంగ్ని చిత్రబృందం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పాట ప్రతిఒక్కర్నీ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించినట్టుగా తెలుస్తోంది. కీరవాణి సంగీత సారథ్యంలో హేమచంద్ర (తెలుగు), అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళం), యాజిన్ నైజర్ (కన్నడ), విజయ్ ఏసుదాస్ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు సంగీత యువ కెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









