ఈ-రూపీని ఆవిష్కరించిన ప్రధాని మోది
- August 02, 2021
న్యూ ఢిల్లీ: నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ-రూపీ (e-RUPI) అనే కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది.ఆగస్టు 2న ఇది దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది.ప్రధాని మోది ఈ యాప్ ను ప్రారంభించారు.డిజిటల్ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ విషయంలో దేశంలో ఈ-రూపీ కీలకపాత్ర పోషించనున్నట్లు మోది తెలిపారు.ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ పేమెంట్ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్లెస్, కాంటాక్ట్లెస్గా ఉండేలా రూపొందింది.
ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కి పంపిస్తారు. ప్రస్తుతం డిజిటల్ ప్రెమెంట్స్ యాప్స్ ద్వారా చేస్తున్న విధంగానే ఉంటుంది.కానీ ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధాని మోదీ తెలిపారు.ఈ వోచర్లు ఈ-గిఫ్ట్ కార్డులు వంటివి, ఇవి ప్రీపెయిడ్ స్వభావం కలిగి ఉంటాయి.
ఉదాహరణకు మెడిసిన్ కొనేందుకు ఈ -రూపీ వోచర్లు తీసుకుంటే ఆ వోచర్లను మెడిసిన్ కొనేందుకే వాడాలి.ప్రెమేట్లు మొత్తం వోచర్ల ద్వారానే జరుగుతాయి. మనం చెల్లించాల్సిన వారికి వోచర్ ఎస్ఎంఎస్ చేయడం.. లేదంటే స్కాన్ చేయడం వంటివి చేయాలి.స్మార్ట్ ఫోన్ లేనివారు వోచర్ కోడ్ ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది.
ఈ-ఆర్ యుపీఐ వోచర్లు అనేవి నిర్ధిష్టమైన వాటి కోసం మాత్రమే ఉద్దేశించబడినవి. బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ పేమెంట్ యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. అదే ఇందులోని ప్రధాన తేడా. ఈ వోచర్లు ఎక్కువగా ఆరోగ్య సంబంధిత చెల్లింపుల కోసం ఉపయోగించబడతాయి.
వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు.సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ సరిపోతుంది. నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకారం, ఇప్పటికే ఎనిమిది బ్యాంకులు ఈ-ఆర్ యుపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండస్ సిండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి.
ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేసింది.
తాజా వార్తలు
- 'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ
- బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
- బహ్రెయిన్ లో రెండో క్లాస్ స్టూడెంట్ పై ప్రశంసలు..!!
- ఆన్ లైన్ లో తప్పుడు ప్రకటనల పై నిషేధం..!!
- యూఎస్-సౌదీ మధ్య స్ట్రాటజిక్ AI భాగస్వామ్యం..!!
- వతన్ 2025 ఎర్సర్ సైజ్.. ప్రజలకు MoI హెచ్చరిక..!!
- యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్..!!
- అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి







