కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి భారీ జరీమానా

- August 02, 2021 , by Maagulf
కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి భారీ జరీమానా

సౌదీ అరేబియా: కరోనా పాండమిక్ నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించి కరోనా ప్రభావిత దేశాల్లో పర్యటించి, తిరిగొచ్చేవారికి 500,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. పోర్టుల ద్వారా అలాంటివారిని తరలించేవారిపైనా ఇవే చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశరు అధికారులు. దేశంలోకి వచ్చే ప్రయాణీకులు తప్పక, తాము కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిందీ లేనిదీ స్పష్టంగా పేర్కొనాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చి చెప్పింది. ఒకవేళ వివరాలు చెప్పకపోతే, కఠినమైన చర్యలు వారిపై వుంటాయి. అర మిలియన్ సౌదీ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుందనీ, ఆపరేటర్ లేదా ఓనర్ (రవాణా సాధరానికి సంబంధించి) కూడా ఉల్లంఘనకు సంబంధించి జరిగే నష్టాన్ని భరించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com