అనాధలను ఆదుకోవడం మన కనీస బాధ్యత: ఉపరాష్ట్రపతి
- August 02, 2021
న్యూఢిల్లీ: అనాధలను ఆదుకోవడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని, అదే సమయంలో వారికి కూడా హక్కులు ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు.తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ ఆధ్వర్యంలో పలువురు అనాధలు ఉపరాష్ట్రపతి ని కలిశారు. తమ హక్కులకు సంబంధించిన చట్టం విషయంలో తమకు సహకారం అందించాల్సిందిగా కోరారు.

ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఉపరాష్ట్రపతి, ప్రభుత్వంలోని పెద్దలతో, సంబంధిత మంత్రులతో తప్పకుండా మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే ఇది కేవలం చట్టాలతో రావలసిన మార్పు కాదని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని తమ బాధ్యతగా గుర్తించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వేతర సేవా సంస్థల ద్వారా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం వైపు నుంచి ఇవి తక్కువగానే ఉన్నాయన్న ఆయన, ఇది మరింత పెరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని తెలిపారు.
తమ కుమార్తె దీపా వెంకట్ అనాధలైన ఐదుగురు పిల్లలకు స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా ఆశ్రయం ఇచ్చి వారి బాగోగులు, చదువు విషయంలో చొరవ తీసుకున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. మనకున్న దానిలో నలుగురికీ సాయం చేయడం ఎంతో ఆనందాన్ని అందిస్తుందన్న ఆయన, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దిశగా ముందుకు రావాలని సూచించారు.అనంతరం ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో ఉపరాష్ట్రపతి చర్చించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









