ట్రావెల్ నిబంధనల్ని సడలించడంతో యూఏఈకి ప్రయాణీకులు పోటెత్తే అవకాశం

- August 04, 2021 , by Maagulf
ట్రావెల్ నిబంధనల్ని సడలించడంతో యూఏఈకి ప్రయాణీకులు పోటెత్తే అవకాశం

యూఏఈ: యుఏఈ ఇటీవల ప్రయాణ నిబంధనల్ని సడలించడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు యుఏఈకి వివిధ దేశాల నుంచి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, నైజీరియా, యుగాండా తదితర దేశాలను సందర్శించి వచ్చే వారిపై బ్యాన్ ఎత్తివేయడంతో పెద్ద సంఖ్యలో ఆయా దేశాల నుంచి ప్రయాణికులు వస్తారని అంచనా వేస్తున్నారు. భారత ఉపఖండం నుంచి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అను నిత్యం (సాధారణ పరిస్థితుల్లో) పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. అదే సమయంలో యుఏఈ నుండి భారత ఉపఖంఢానికి వెళ్లేవారూ ఎక్కువే. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ట్రావెల్ నిబంధనల వల్ల ప్రయాణాలు నెమ్మదించాయి. నిబంధనల సడలింపుతో పూర్వపు పరిస్థితి రావచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com