గోపీచంద్ 30వ చిత్రంలో డా.రాజశేఖర్!
- August 05, 2021
హైదరాబాద్: వెండితెరపై ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చేసి మెప్పించిన డాక్టర్ రాజశేఖర్ కెరీర్ కొంతకాలంగా నత్తనడకన సాగుతోంది.ఆ మధ్య కరోనా నుండి బయటపడిన రాజశేఖర్ వరుసగా మూడు చిత్రాలను అంగీకరించాడు.అయితే…వాటి షూటింగ్ స్టేటస్ ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే…గతంలో మల్టీస్టారర్ మూవీస్ కొన్ని చేసినా…ఆ తర్వాత రాజశేఖర్ సోలో హీరోగా సినిమాలు చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే…తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.
గోపీచంద్ 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించబోతున్నాడు. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మించబోతున్నాడు. గతంలో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలు సక్సెస్ కావడంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ కీలక పాత్ర కోసం డాక్టర్ రాజశేఖర్ ను దర్శకుడు శ్రీవాస్ అప్రోచ్ కాగానే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. హీరోతో పాటు సరి సమానంగా ఆ పాత్రకు ప్రాధాన్యం ఉండటం ఒక కారణంగా కాగా, గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ హీరోగా రాజశేఖర్ నిలబడటం కోసం గట్టి పునాదిని వేశారు. ఆ అభిమానంతోనూ రాజశేఖర్ ఈ మూవీ చేయడానికి అంగీకారం తెలిపారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… రాజశేఖర్ హీరోగా ‘మర్మాణువు, శేఖర్’తో పాటు మరో సినిమా ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. దీనితో పాటే రాజశేఖర్ ఓ తమిళ సినిమాలోనూ కీలక పాత్ర చేయబోతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







