రెస్టారెంట్లు, పెళ్లిళ్లు, ఈవెంట్లకు మరిన్ని సడలింపులు
- August 09, 2021
యూఏఈ: కోవిడ్ ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తూ వస్తున్న యూఏఈ లేటెస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, కేఫ్ లు, ఈవెంట్లు, వివాహాలకు మరిన్ని సడలింపులు ప్రకటించింది. రెస్టారెంట్లు, కేఫ్ లలో 80 శాతం మందికి అనుమతి ఇచ్చింది. ఒక్క టేబుల్ పై పది మంది వరకు కూర్చొవచ్చు. అయితే..తమ టేబుల్ పక్కకు రాగానే విధిగా మాస్కులు ధరించాల్సిందే. అలాగే రెస్టారెంట్లు, కేఫ్ సిబ్బంది వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ మెయిన్టేన్ చేస్తూ ఫేస్ మాస్క్ ఖచ్చితంగా ధరించాలి. ఇక ఈవెంట్లలో 60 శాతం మందికి అనుమతి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టులలో అనుమతి సామర్ధ్యాన్ని 75 శాతానికి పెంచింది.పెళ్లిళ్లకు పూర్తి సామర్ధ్యంలో 60 శాతం మంది హజరుకావొచ్చు. అయితే..గరిష్టంగా 300 మందికి మించి ఉండకూడదు. అంటే పెళ్లి వేదిక పూర్తి సామర్ధ్యంలో 60 శాతంగానీ, లేదంటే గరిష్టంగా 300 మందికిగానీ అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









