6 గం.ల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి..UAE ప్యాసింజర్లకు గైడ్ లైన్స్
- August 12, 2021
న్యూఢిల్లీ: భారత్ నుంచి యూఏఈ చేరుకునే ప్రయాణికులు ఖచ్చితంగా తమ ఫ్లైట్ టైం కంటే 6 గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి. ఎమిరేట్స్ కొత్త మార్గనిర్దేశకాల అనుసారంగా ఈ కొత్త సూచనలు చేస్తున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది. ఎమిరేట్స్ గైడ్ లైన్స్ మేరకు ఇండియాలోని ఏ ఎయిర్ పోర్టు నుంచి అయినా యూఏఈ వెళ్లే ప్రయాణికులకు ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఆ తర్వాతే ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించాలి. అంటే ప్రతి ప్రయాణికుడు ఫ్లైట్ బయల్దేరే టైం కంటే 6 గంటల ముందు ఎయిర్ పోర్టుకు చేరుకొని...అక్కడి ర్యాపిడ్ టెస్ట్ కౌంటర్లలో టెస్ట్ చేయించుకోవాలి. ఫ్లైట్ టైంకి నాలుగు గంటల ముందు ర్యాపిడ్ టెస్ట్ కౌంటర్లను తెరుస్తారు. ఫ్లైట్ టైంకి రెండు గంటల ముందు కౌంటర్ క్లోజ్ చేస్తారు. ఆ వెంటనే టెస్ట్ రిపోర్టులు అందిస్తారు. నెగటీవ్ రిజల్ట్ వచ్చిన వారికి మాత్రమే ఫ్లైట్లోకి అనుమతించనున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









