భారత్ కరోనా అప్డేట్
- August 12, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.మరోసారి 40 వేల మార్క్ను దాటి పైకి కదిలాయి కొత్త కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 41,195 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో 490 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు..ఇదే సమయంలో 39,069 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.దీంతో..మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరింది. ఇందులో 3,12,60,050 మంది కోలుకున్నారు.ఇక, కరోనా బారినపడి ఇప్పటి వరకు 4,29,669 మంది బాధితులు మృత్యువాతపడగా.. ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులున్నాయి.యాక్టివ్ కేసులు 1.21 శాతంగా ఉన్నాయని..రికవరీ రేటు 97.45 శాతానికి చేరుకుందని,రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది కేంద్రం.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









