460 నుంచి 129కి తగ్గిన కోవిడ్ ఐసీయూ పేషెంట్లు
- August 12, 2021
ఒమన్: ఐసీయూలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని ఒమన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్ల సంఖ్య 129కి తగ్గిందని మంత్రి తెలిపారు. మొన్నటి వరకు 460 మంది ఐసీయూలో ఉన్నారని అన్నారు. ఐసీయూ పేషెంట్ల కోసం 2,064 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారని అన్నారు. కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించటంలో ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడుతున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.మహమ్మారి కమ్ముకొచ్చిన తొలి నాళ్లలో తమకు కేవలం 148కి ఐసీయూ బెడ్లు మాత్రమే ఉన్నాయన్నారు.కానీ, ఇప్పుడు అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ సంఖ్యలో ఐసీయూ బెడ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు.ఇదిలాఉంటే గత రెండు రోజుల్లో ఒమన్లో కొత్తగా 476 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 22 మంది ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో 20 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









