ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- March 28, 2026
హైదరాబాద్: ఐపీఎల్ సీజన్-19 కోలాహలం మొదలైన నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు మరియు యువతకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. క్రికెట్ను కేవలం ఒక ఉల్లాసభరితమైన క్రీడగా మాత్రమే ఆస్వాదించాలని, ఉత్సాహంలో పడి బెట్టింగ్ల ఉచ్చులో చిక్కుకుని విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు. గతంలో బెట్టింగ్లపై కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త పుంతలు తొక్కుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ నిర్వహించే ముఠాలు చురుగ్గా మారుతున్నాయని, యువతను ఆకర్షించేందుకు రకరకాల మార్గాలను వాడుతున్నారని సీపీ పేర్కొన్నారు. కేవలం బెట్టింగ్ నిర్వహించే వారే కాకుండా, డబ్బు ఆశతో ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే వారిపై కూడా పోలీసులు నిఘా ఉంచారని, అటువంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
బెట్టింగ్ వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని, కాబట్టి యువత తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సజ్జనార్ హితవు పలికారు. మీ చుట్టుపక్కల ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిసినా లేదా ఆన్లైన్ బెట్టింగ్ లింకుల గురించి సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100 లేదా 94906 16555 అనే ప్రత్యేక నంబర్కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









