40 లక్షల మార్క్ చేరుకున్న వ్యాక్సినేషన్

- August 12, 2021 , by Maagulf
40 లక్షల మార్క్ చేరుకున్న వ్యాక్సినేషన్

ఖతార్: కోవిడ్ ఎదుర్కునేందుకు కమ్యూనిటీ ఇమ్యూనిటీ ప్రోగ్రాంను ముమ్మరం చేసిన ఖతార్..నిన్నటితో 40 లక్షల మైలు రాయి చేరుకుంది. ఖతార్ వ్యాప్తంగా ఇప్పటివరకు 40 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం 40,12,536 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు గణాంకాలతో వివరించింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హత ఉన్న(12 ఏళ్లు పైబడిన వారు) వారిలో దాదాపుగా 88.8 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని స్పష్టం చేసింది. 74.9 శాతం మందికి రెండు డోసులు అందాయని తెలిపింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 21,570 మందికి వ్యాక్సిన్ అందించారు. సమాజంలోని ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకొని బాధ్యతాయుతంగా మసలుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com