దుబాయ్ లో "గల్ఫ్" పాట, టీజర్ ఆవిష్కరణ!
- March 13, 2016
గల్ఫ్ కు వలస వచ్చిన భారతీయుల విజయ గాధల సమాహారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'గల్ఫ్'. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.గల్ఫ్ దేశాల్లో చాలా మందిని కలిసి వారి నుండి సమాచారాన్ని సేకరించడంతో పాటు 500 కేస్ స్టడీస్ తో యదార్ధ ఘటనల ఆధారంగా ఈ కధ తయారు చేసుకున్నారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఈ చిత్రానికి సంబంధించిన పాటల్లో ఒక పాటను, టీజర్ ను శనివారం దుబాయ్ లో ఆవిష్కరించారు. గల్ఫ్ వలసల మీద రూపొందిస్తున్న సినిమా కావడంతో దుబాయ్ లోని జజీరా ఎమిరేట్స్ పవర్ అనే ప్రముఖ కంపెనీ కి చెందిన సోనాపూర్ అనే లేబర్ క్యాంపు లో ఈ వేడుక నిర్వహించారు. జజీరా ఎమిరేట్స్ పవర్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ బాబు, బీటెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరాం, గల్ఫ్ లో అడ్వకేట్ గా పనిచేస్తున్న అనురాధ, 'మాగల్ఫ్.కామ్' నిర్వాహకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సినిమాలో కధానాయకుడు, నాయికలుగా కొత్తవారు నటిస్తుండగా ఇతర పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఎల్.బి.శ్రీరాం, నాగినీడు, జబర్దస్త్ వేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై లో విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరాం, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.బాపిరాజు.
















తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









