వరల్డ్ కప్ మ్యాచుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం : సౌరవ్ గంగూలీ
- March 13, 2016
వరల్డ్ కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ టీ-20 మ్యాచును కోల్కతాలో నిర్వహిస్తుండటంపై బెంగాల్ క్రికెట్ అసిసోయేషన్ (క్యాబ్) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచు వేదిక హఠాత్తుగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు మారడం తమ అదృష్టమని పేర్కొన్నాడు. కోల్కతాలో గతంలోనూ ఇండో-పాక్ మ్యాచులను నిర్వహించామని, ఈసారి మరింత ఉత్తమంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఓ జాతీయ చానెల్తో చెప్పారు.మధ్యప్రదేశ్ ధర్మశాలలో ఈ నెల 19న జరుగాల్సిన భారత్-పాక్ మ్యాచును అకస్మాత్తుగా కోల్కతాకు మార్చిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచుకు కొన్ని రోజులే ఉండటంతో కోల్కతాలో ఇందుకు తగినన్ని సన్నాహాలు చేయడం కష్టమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ అభిప్రాయపడ్డారు.ఆయన అభిప్రాయాన్ని గంగూలీ సున్నితంగా తోసిపుచ్చారు. 'వరల్డ్ కప్ మ్యాచులతోపాటు ఫైనల్ కోసం కూడా మేం ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించాల్సి రావడం నాకు అవకాశమే కానీ సవాల్ కాబోదు. మొత్తం టోర్నమెంట్ కోసం మేం ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి.ఇందులో భాగంగానే మరో మ్యాచుకు ఆతిథ్యం ఇవ్వాల్సి రావడం పెద్ద కష్టమేమీ కాదు. అకస్మాత్తుగా ఈ మ్యాచుకు ఆతిథ్యం ఇవ్వాల్సి వస్తే సమస్య ఎదురయ్యేది కానీ, మేం ఇప్పటికే వరల్డ్ కప్ మ్యాచుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నేపథ్యంలో ఇదేం పెద్ద సమస్య కాదు' అని 43 ఏళ్ల గంగూలీ తెలిపారు. భారత్-పాక్ మ్యాచ్ కోసం పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ మ్యాచుకు ఎలాంటి లోటు రానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









