వలసదారుల స్వర్గధామం బహ్రెయిన్
- March 13, 2016
వలసదారుల స్వర్గధామంగా బహ్రెయిన్ అరుదైన ఘనతను సాధించింది. హాంగ్కాంగ్ అండ్ షాంగై బ్యాంకింగ్ కార్పొరేషన్ (హెచ్ఎస్బిసి) నిర్వహించిన సర్వేలో వలసదారులు బహ్రెయిన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తేలింది. సర్వేలో 66 శాతం మంది వలసదారులు బహ్రెయిన్కి ఓటేశారు. బహ్రెయిన్ ప్రజలతో మమేకం అవడంలోనూ, బహ్రెయిన్ ప్రభుత్వం వలసదారులకు కల్పిస్తున్న సౌకర్యాల విషయంలోనూ, ఉద్యోగావకాశాల విషయంలోనూ బహ్రెయిన్ వలసదారులకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇత దేశాలకు చెందినవారికి బహ్రెయిన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించుకోవడానికి వీలుగా ఉంటుంది బహ్రెయిన్. ఇతర దేశాల సంస్కృతీ సంప్రదాయాల్ని గౌరవించడంలోనూ బహ్రెయిన్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. విశాల దృక్పథంతో బహ్రెయిన్ పాలకులు వ్యవహరించే తీరు వలసదారుల్ని బహ్రెయిన్ ఎట్రాక్ట్ చేసేలా ఉంది. 21,950 మంది వలసదారుల అభిప్రాయం తీసుకుని, ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో బహ్రెయిన్కే ఎక్కువ శాతం వలసదారులు ఓటేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







