విద్యార్ధినులు, జర్నలిస్టులకు ఖతార్ బాసట..అఫ్గన్ నుంచి తరలింపు

- August 22, 2021 , by Maagulf
విద్యార్ధినులు, జర్నలిస్టులకు ఖతార్ బాసట..అఫ్గన్ నుంచి తరలింపు

దోహా: అఫ్గనిస్తాన్ శరణార్ధులను ఆదుకునేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని ఖతార్ స్పష్టం చేసింది. ప్రాణభయంతో ఇతర దేశాలకు వెళ్తున్న వారి కోసం విమాన సర్వీసులను కొనసాగించనున్నట్లు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా గత 72 గంటల్లో 300 చదువుకునే ఆడపిల్లలు, 200 మంది మీడియా రంగానికి చెందిన వ్యక్తులను అఫ్గాన్ నుంచి తరలించినట్లు తెలిపింది. వారిలో చాలా మంది తమ కుటుంబాలతో సురక్షితంగా సౌకర్యమైన వసతిలో ఉన్నారని తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com