ఒమాన్ వెదర్: మోటరిస్ట్లకి హెచ్చరిక
- June 04, 2015
ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిటియరాలజీ అండ్ ఎయిర్ నావిగేషన్, మస్కట్లో విజిబులిటీ 3000 మీటర్లకు పడిపోయినట్లు తెలిపింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రెండ్రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉందనీ, ఈస్టర్న్ విండ్స్ కారణంగా ఇసుక గాల్లోకి లేచి, వాహనదారులకు ఇబ్బందులు కలగజేయనుందనే హెచ్చరికల్ని జారీ చేసింది వాతావరన శాఖ. మోటార్ వాహనాలపై వెళ్ళేవారు, ముఖ్యంగా టూవీలర్స్పై ప్రయాణించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎడారులు, ఓపెన్ ఏరియాస్లో తిరిగేవారు ఇసుక గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సముద్రం తీర ప్రాంతంలో సేద తీరాలనుకునేవారు, ముఖ్యంగా టూరిస్టులు, సముద్రం రఫ్గా ఉంటుంది గనుక తగు జాత్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 3 మీటర్ల వరకూ సముద్ర కెరటాలు ఎగసిపడే ప్రమాదం ఉంది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







