భారత కార్మికుల పాత్రను కొనియాడిన బహ్రెయిన్ మినిస్టర్

- September 02, 2021 , by Maagulf
భారత కార్మికుల పాత్రను కొనియాడిన బహ్రెయిన్ మినిస్టర్

మనామా: లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ అలాగే లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ జమిల్ బిన్ మొహమ్మద్ అలి హుమైదాన్, భారత విదేశాంగ శాఖ అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వి. మురళీధరన్‌కి తమ దేశంలో వర్క్‌ఫోర్స్‌కి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అందిస్తున్న భద్రత, సౌకర్యాల విషయమై వివరించారు. భారత కార్మికులు, బహ్రెయిన్ అభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్ర గురించి కూడా తెలియజేశారు. ఇరువురి మధ్యా జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. కరోనా నేపథ్యంలో బహ్రెయిన్, తమ వర్క్ ఫోర్స్‌కి కల్పించిన సౌకర్యాల పట్ల మినిస్టర్ హర్షం వ్యక్తం చేశారు. మురళీధరన్ సైతం, బహ్రెయిన్‌కి అభినందనలు తెలిపారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com