అబుధాబి:వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు క్వారంటైన్ తొలగింపు
- September 02, 2021
అబుధాబి: అబుధాబి ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ తన ట్రావెల్ నిబంధనల్ని పౌరులు, రెసిడెంట్స్, విజిటర్స్ (అబుధాబిలోకి ప్రవేశించేవారికి) సడలించడం జరిగింది. సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది కొత్త విధానం. కోవిడ్ వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు అబుధాబిలోకి వచ్చాక ఎలాంటి క్వారంటైన్ వుండదు. గ్రీన్ లిస్టులో లేని డెస్టినేషన్ల నుంచి వచ్చే వ్యాక్సిన్ పొందని ప్రయాణీకులు మాత్రం 10 రోజులు క్వారంటైన్లో వుండాల్సిందే. వ్యాక్సిన్ పొందినవారు, పొందనివారు..నెగెటివ్ పిసిఆర్ టెస్ట్ ఫలితాన్ని, ప్రయాణానికి 48 గంటల ముందుగా తీసుకుని సమర్పించాల్సి వుంటుంది. కాగా, వ్యాక్సిన్ పొందిన పౌరులు, రెసిడెంట్స్, విజిటర్స్, పిసిఆర్ టెస్టుని అబుధాబి రాగానే తీసుకోవాలి. ఆ తర్వాత ఆరవ రోజున కూడా టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ పొందనివారు (గ్రీన్ లిస్ట్) కూడా పిసిఆర్ టెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత 6 అలాగే 9వ రోజున కూడా టెస్టులు చేయించుకోవాలి. గ్రీన్ లిస్టులో లేని ప్రాంతాల నుంచి వచ్చేవారు వస్తూనే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడంతోపాటు, క్వారంటైన్లోకి వెళ్ళాలి. 9వ రోజున టెస్ట్ చేయించుకోవాలి.
--సుమన్ కోలగొట్ల(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!







