మిడ్ 2022 నాటికి 250K ఔన్సుల గోల్డ్, సిల్వర్ ఉత్పత్తికి కసరత్తు
- September 03, 2021
సౌదీ: 2022 మధ్య కాలం నాటికి రెండు మేజర్ గోల్డ్ మైన్స్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని సౌదీ అరేబియా లక్ష్యంగా నిర్దేశించుకుంది. మక్కా పరిధిలోని అల్ ఖుర్మా గవర్నరేట్ లోని మన్సౌరా& మసారా SR3.3 బిలియన్ల విలువైన గోల్డ్ ప్రాజెక్ట్ లో 250,000 ఔన్సుల గోల్డ్, సిల్వర్ ను ఉత్పత్తి చేసే కెపాసిటీ కలిగి ఉంది. ఈ మైన్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ కార్మికుల సంఖ్య 4,500 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో స్థానికుల రేటు 20 శాతంగా ఉంది. అయితే..అపరేషన్ దశలో మాత్రం కార్మికుల సంఖ్య 900కి చేరుకుంటుందని, ఆ సమయానికి స్థానిక కార్మికుల రేటు 49 శాతంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలాఉంటే..గోల్డ్ మైనింగ్ లో అత్యాధునికత సాంకేతికతగా చెప్పుకునే ఆటోక్లేవ్ టెక్నాలజీని గోల్డ్ ప్రాసెస్ లో వినియోగిస్తున్నట్లు వివరించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







