దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో ముగ్గురు హతం
- March 15, 2016
ఇటీవల గుజరాత్ ద్వారా దేశంలోకి ప్రవేశించిన పది మంది ఉగ్రవాదుల్లో ముగ్గురుని హతమార్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. మిగిలిన ఉగ్రవాదులు కూడా ఎక్కడున్నారనే అంశం తెలుసని తెలిపారు. భద్రత వర్గాల ప్రణాళికలు దెబ్బతినకుండా ఉండేందుకు మరే ఇతర సమాచారం వెల్లడించడంలేదని తెలిపారు. ఈ నెల ఆరంభంలో గుజరాత్ ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించారని సమాచారం అందడంతో అక్కడ హైఅలర్ట్ ప్రకటించి.. శివరాత్రి సందర్భంగా సోమనాథ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వారు గుజరాత్ నుంచి దిల్లీకి వెళ్లి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







