దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో ముగ్గురు హతం

- March 15, 2016 , by Maagulf
దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో ముగ్గురు హతం

ఇటీవల గుజరాత్‌ ద్వారా దేశంలోకి ప్రవేశించిన పది మంది ఉగ్రవాదుల్లో ముగ్గురుని హతమార్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. మిగిలిన ఉగ్రవాదులు కూడా ఎక్కడున్నారనే అంశం తెలుసని తెలిపారు. భద్రత వర్గాల ప్రణాళికలు దెబ్బతినకుండా ఉండేందుకు మరే ఇతర సమాచారం వెల్లడించడంలేదని తెలిపారు. ఈ నెల ఆరంభంలో గుజరాత్‌ ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించారని సమాచారం అందడంతో అక్కడ హైఅలర్ట్‌ ప్రకటించి.. శివరాత్రి సందర్భంగా సోమనాథ్‌ ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వారు గుజరాత్‌ నుంచి దిల్లీకి వెళ్లి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com