సంఘసేవకురాలు మదర్ థెరిసాకు 'సెయింట్' హోదా

- March 15, 2016 , by Maagulf
సంఘసేవకురాలు మదర్ థెరిసాకు 'సెయింట్' హోదా

సుదీర్ఘ చర్చల తరువాత నోబెల్ బహుమతి విజేత, సంఘసేవకురాలు మదర్ థెరిసాకు 'సెయింట్' హోదానిచ్చినట్లు క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ఇకముందు ఆమెను దైవదూతగా వ్యవహరిస్తారు. విదేశాల్లో పుట్టి యుక్తవయస్సులో భారత్‌లో అడుగుపెట్టి పేదలు, రోగుల సేవకు జీవితాన్ని అంకితం చేసి అందరి దృష్టిలో అమ్మగా చిరస్థానం సంపాదించుకున్న మదర్ థెరిసాకు 1979లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. కోల్‌కతా కేంద్రంగా ఆమె స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థల తరపున విద్య, సేవా కార్యక్రమాలను ఆమె నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com