రవితేజ ఈడీ విచారణ ప్రారంభం…
- September 09, 2021
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈడీ ముందు హాజరయ్యాడు రవితేజ. డ్రైవర్ తో కలిసి తన బ్యాంకు డీటెయిల్స్ కు సంబంధించిన ఫైల్స్ తో ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి సరైన సమయానికి ఈడీ ఆఫీస్ ముందు హాజరయ్యారు. తాజాగా ఈడీ రవితేజ విచారణను ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో రవితేజ డ్రైవర్ శ్రీనివాస కీలకం. ఎందుకంటే ఈ కేసు అతని పట్టుకోవడం ద్వారానే వెలుగులోకి వచ్చింది ఎక్సైజు శాఖ ఈ కేసులో ముందుగా శ్రీనివాస్ ని పట్టుకున్నారు. ఆ తరువాత అతని ద్వారా టాలీవుడ్ డ్రగ్స్ లింక్స్ బయటపడ్డాయి.
శ్రీనివాస్ ద్వారా ఎక్సైజు ప్రత్యేక దర్యాప్తు బృందం కెల్విన్ ను పట్టుకుంది. ఇద్దరినీ విచారించగా నటీనటుల డ్రగ్స్ వాడకం బండారం మొత్తం బయట పెట్టేశారు. అలా డ్రగ్స్ లింక్స్ బయటపడడంతో సినిమా నటీనటులకు నోటీసిచ్చి ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసింది. ఈ కేసులో శ్రీనివాస్, కెల్విన్, ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ల బ్యాంకు లావాదేవీల కీలకంగా మారాయి. శ్రీనివాస్ ద్వారా టాలీవుడ్ కు డ్రగ్స్ సరఫరా అయినట్లుగా అధికారులు గుర్తించారు. తాజాగా విచారణకు హాజరైన రవితేజ, శ్రీనివాస్ బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన స్టేట్మెంట్ ను ఈడి అధికారులకు ఇచ్చారు. ఆ లావాదేవీలు, డ్రగ్స్ కు సంబంధించి ఈడీ అధికారుల విచారణ కొనసాగనుంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









