ఏపీ కరోనా : నేడు తగ్గిన కరోనా కేసులు...

- September 11, 2021 , by Maagulf
ఏపీ కరోనా : నేడు తగ్గిన కరోనా కేసులు...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ... తగ్గుతూ.. వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 49,581 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,145 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 17 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 1,090 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,28,795 కు పెరగగా… రికవరీ కేసుల సంఖ్య 19,99,651 కు చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 13,987 మంది మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15,157 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com