ఐపిఎల్ ఫాన్స్ కు షాక్ : కీలక ఆటగాళ్లు దూరం !

- September 11, 2021 , by Maagulf
ఐపిఎల్ ఫాన్స్ కు షాక్ : కీలక ఆటగాళ్లు దూరం !

మెగా టోర్నీకి ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందే ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు మెగా టోర్నీకి దూరంగా ఉండగా… తాజాగా మరో ముగ్గురు ఉంటున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో ముఖ్యంగా ఈ ఐపీఎల్ మ్యాచ్ లకు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది. ఇంగ్లాండ్ కీపర్, సన్ రైజర్స్ ఆటగాడు బేయిర్ స్టో, డేవిడ్ మిలాన్ మరియు క్రిస్ వోక్స్ ఐపీఎల్లో 2021 కి దూరం కానున్నట్లు తెలుస్తోంది.
 
అయితే ఇంగ్లాండ్ దేశానికి చెందిన కొన్ని వెబ్సైట్లలో ఈ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్ 2021 నుంచి తప్పు చేసినట్లు ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఈ ఆటగాళ్లు ఐపీఎల్ దూరం అయితే… మ్యాచుల్లో పడ్డ పోతుందని ఐపిఎల్ ట్రాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆటగాళ్లు దూరమవుతున్నట్లు అఫీషియల్ గా ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com