బంగారం స్మగ్గ్లింగ్: ఇదో ఖతర్నాక్ ఐడియా...

- September 11, 2021 , by Maagulf
బంగారం స్మగ్గ్లింగ్: ఇదో ఖతర్నాక్ ఐడియా...

న్యూ ఢిల్లీ: దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు ఉజ్బెకిస్తానీలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని నోటి కుహరంలో దాచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఈ విషయాన్ని ఢిల్లీ కస్టమ్స్ విభాగం తెలిపింది.వివరాల్లోకి వెళ్తే..

భారత్ లో బంగారం) ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దాదాపు 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేలకు చేరుకుంది. అయితే మన దేశంలో కంటే ఇతర దేశాల్లో బంగారం ధరలుచాలా తక్కువగా ఉంటాయి. ఇలా వేరే దేశాలను నుంచి బంగారు దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి అవసరం. బంగారం ఎగుమతి, దిగుమతి వ్యవహారం అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అయితే కొంత మంది స్మగ్లర్లువాటిని ఒక దేశం నుంచి మరో దేశానికి తీసుకు వెళ్లేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. పోలీసులకు చిక్కకుండా తన శరీరాన్ని కూడా సాధనంగా వాడుకుంటున్నారు.ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్లు దొరికిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com