తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- September 11, 2021
తిరుపతి: తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ చేయనున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి విమానాశ్రయం కూడా ఒకటి. ఈ ఎయిర్ పోర్టును కూడా ప్రయివేట్ పరం చేసేందుకు పావులు కదుపుతోంది. తిరుమల శ్రీనివాసుడిని నిత్యం లక్షల మంది దర్శించుకుంటుంటారు. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి కూడా భారీసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన తిరుపతిలోని విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తిరుపతి శ్రీనివాసుడిని దర్శించుకునేవారిలో చాలామంది రైలు ప్రయాణంతో పాటు విమాన ప్రయాణాలకు కూడా మెగ్గుచూపుతున్నారు. ఇటీవల విమానంలో తిరుపతికి చేరుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు నుంచి అతి తక్కువ సమయంలో తిరుపతి చేరుకోవచ్చు. సమయం కూడా చాలా ఆదా అవుతుంది. అందుకే చాలామంది ప్రయాణికుల ఈ విమాన ప్రయాణంపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి రైలు ప్రయాణం కొంచెం భారంగా అనిపిస్తోంది. తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకోవాలంటే వాయు మార్గమే చాలా సులభమమని భావిస్తున్నారు. సాధారణంగా విమాన ప్రయాణాన్ని ఎక్కువగా సంపన్నవర్గాలకు చెందిన వారే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, ఇటీవల పరిస్థితుల్లో సామాన్యులు కూడా తిరుపతికి విమానంలోనే ప్రయాణం చేస్తున్నారు. ఇంతగా ప్రసిద్ధిచెందిన తిరుపతి విమానాశ్రయాన్ని కేంద్రం ప్రయివేట్ పరం చేయాలనుకోవడంతో అందరిని షాకింగ్ గురిచేస్తోంది. త్వరలోనే తిరుపతి విమానశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎయిర్ పోర్టును కూడా ప్రయివేట్ పరం చేయాలనుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దేశంలో లాభాల్లో మేజర్ ఎయిర్పోర్టులతో కలిపి.. నష్టాల్లో ఉన్న మైనర్ ఎయిర్పోర్టులతో పాటు తిరుపతి ఎయిర్ పోర్టుకు ముడిపెట్టింది కేంద్రం. తిరుచ్చి ఎయిర్పోర్ట్తో తిరుపతి ఎయిర్పోర్ట్ను లింక్ చేసింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









