ఏపీ కరోనా అప్డేట్

- September 14, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49, 568 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1125 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.. మరో 09 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇక ఇదే సమయంలో 1,356 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2, 74, 13, 209 కు చేరుకున్నాయి.

మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14, 019 కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14, 412 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. ఇక, పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,31,974 కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 20,03, 543 కు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com