ఆత్మాహుతి దాడులు : నైజీరియా

- March 16, 2016 , by Maagulf
ఆత్మాహుతి దాడులు : నైజీరియా

: నైజీరియాలోని మైదుగురి శివార్లలోని ఓ మసీదులో బుధవారం వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఇద్దరు మహిళలు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత ఓ మహిళ మసీదు లోపల ఆత్మాహుతి దాడి చేసింది. దీంతో తామంతా భయంతో పరుగులు తీస్తుండగా.. మరో మహిళ తనను తాను పేల్చేసుకుందని ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మరో 17 మంది త్రీవంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.బొకొహరమ్‌ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని స్థానిక అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com