రువిలో అగ్నిప్రమాదం: 28 కుటుంబాల తరలింపు
- March 16, 2016రువిలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో రెస్క్యూ సిబ్బంది సకాలంలో స్పందించి, 28 కుటుంబాల్ని ఆ భవనం నుంచి ఖాళీ చేయించారు. బుధవారం తెల్లవారు ఝామున ఈ ప్రమాదం జరిగింది. ఏం జరిగిందనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సుమారు 2 గంటలపాటు ఫైర్ బ్రిగేడ్స్ అగ్ని కీలలతో పోరాటం చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. గత వారం కూడా ముట్రాలో ఓ భవనం అగ్ని ప్రమాదానికి గురయ్యింది. రాయల్ ఒమన్ పోలీసులు వరుస అగ్ని ప్రమాదాలపై స్పందిస్తూ, భవనాల్ని నిర్మించడం, నిర్వహించడం వంటి విషయాల్లో అలక్షం ఈ ప్రమాదాలకు కారణంగా అభిప్రాయపడ్డారు. తగిన రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనీ, హోటళ్ళు, పోర్టులు, బ్యాంకులు ఇతర ప్రముఖ భవనాల్లో భద్రతా చర్యల విషయంలో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని రాయల్ ఒమన్ పోలీస్ అసిసె&ంట్ జనరల్ మేనేజర్ ఫర్ ఆపరేషన్స్ కల్నల్ సైద్ అల్ అస్మి చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







