ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
- September 17, 2021
తిరుమల: కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.థర్డ్ వేవ్పై రకరకాల అంచనాలున్నాయి.అయితే.. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కారణంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతమగానే నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ.. ఈ విషయాన్ని వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఇక, మరో వారం రోజులలో ఆన్లైన్లో సర్వదర్శన టోకెన్ల జారీని ప్రారంభిస్తామన్న ఆయన.. మరోవైపు.. అన్నమయ్య కీర్తనలకు బహుళ ప్రచారం కల్పిస్తాం అన్నారు.అన్నమయ్య కీర్తనలు అన్నింటికి ప్రాచుర్యం కల్పించడానికి అదివో అల్లదివో పాటల పోటీ కార్యక్రమాని ప్రారంభిస్తున్నామని తెలిపారు.15 నుంచి 25 సంవత్సరాల వయ్ససు కలిగినవారు ఈ పాటల పోటీల్లో పాల్గొనవచ్చన్న ఆయన.. జిల్లా స్థాయిలో ప్రారంభించి రాష్ట్ర స్థాయిలో కూడా ఈ పోటీ కార్యక్రమం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









