80% మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌

- September 17, 2021 , by Maagulf
80% మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌

యూఏఈ: యూఏఈలో దాదాపు 80 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ అందించిన‌ట్లు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. గ‌త‌ 24 గంటల్లో 83,410 డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్లు తెలిపింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 19.2 మిలియన్ల‌కు చేరుకుంద‌ని స్ప‌ష్టం చేసింది. అంటే ప్ర‌తి వంద మందికి 194.60 రేటు చొప్పున వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూష‌న్ జ‌రిగిన‌ట్ల‌ని వివ‌రించింది. ఇదిలాఉంటే...సెప్టెంబర్ 16 నాటికి, యూఏఈ జనాభాలో 91.32 శాతం మంది కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదును అందుకున్నార‌ని...80.29 శాతం మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నార‌ని ప్ర‌క‌టించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com